నారాయణ కాలేజీలో పెట్రోల్ పోసుకున్న ఘటనలో ఒకరు మృతి

-

హైదరాబాద్ రామంతపూర్ లోని నారాయణ కాలేజీలో పెట్రోల్ పోసుకున్న ఘటనలో ఒకరు మృతి చెందారు. 15 రోజుల క్రితం అంబర్ పేట నారాయణ కాలేజీలో విద్యార్థి సందీప్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. అతనిని అడ్డుకునే క్రమంలో ప్రిన్సిపల్, ఏవో అశోక్ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స పొందుతూ అశోక్ రెడ్డి మరణించాడు. విద్యార్థి సందీప్ పరిస్థితి విషమంగా ఉంది.

గత 15 రోజుల క్రితం నారాయణ కాలేజీలో విద్యార్థి ప్రిన్సిపల్ గదిలోకి వెళ్లి తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ ను విద్యార్థి తనపై పోసుకొని నిప్పుంటించుకున్నాడు. అయితే విద్యార్థితో పాటు ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి, ఏవో అశోక్ రెడ్డికి గాయాలయ్యాయి. ముగ్గురిని కాలేజీ సిబ్బంది గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఫీజు కట్టలేదని టీసి ఇవ్వకుండా ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి వేధించాడని విద్యార్థులు ఆరోపించారు. ప్రిన్సిపల్ తీరు వల్లే విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని విద్యార్థులు ఆరోపించారు. ఈ ఘటనలో తాజాగా ఒకరు మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news