మా కార్యకర్తలు ఆన్లైన్లో టికెట్ తీసుకున్నారు.. షో లోపలే మునావర్ పై దాడి చేస్తాం – రాజా సింగ్

-

ప్రముఖ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరుఖీ షో హైదరాబాదులో హిట్ పెంచుతుంది. రేపు నగరంలో ఫరూఖీ షో కి పోలీసులు అనుమతి ఇచ్చారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాండ్ అప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షో ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే బీజేపీ కార్యకర్తలు ఆన్లైన్ లో టికెట్లు తీసుకున్నారని.. షో లోపలే మునావర్ ఫారూఖీ పై దాడి చేస్తామని తెలిపారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే.. డిజిపి, ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరించారు.

ఒకవేళ బిజెపి పార్టీ నాయకులు వద్దన్నా.. నేను షో ని అడ్డుకొని తీరుతానని రాజాసింగ్ స్పష్టం చేశారు. తనకి పార్టీ ముఖ్యం కాదని.. ధర్మమే ముఖ్యమని తెలిపారు. హిందూ దేవుళ్లను కించపరిచే వారి కామెడీ షోలకు ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునావర్ ఫారూఖీ షో జరిగితే మరిసటి రోజు నా సమాధానం కూడా గట్టిగానే ఉంటుందని అన్నారు. నావల్ల ఇప్పటివరకు ఎక్కడ శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని అన్నారు రాజా సింగ్.

Read more RELATED
Recommended to you

Latest news