పట్నం మహేందర్ రెడ్డి వెన్నుపోటు పొడిచారు : కేటీఆర్

-

పట్నం మహేందర్ రెడ్డి వెన్నుపోటు పొడిచారు  అని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ భవన్ లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గెలవాల్సిన చోట్ల కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కొందరి వల్ల స్వల్ప తేడాతో ఓడిపోయాం. కేసీఆర్ ఎవ్వరినీ నిలబెట్టినా మీరు భారీ మెజార్టీతో గెలిపించారు. ముఖ్యంగా మహేందర్ రెడ్డి వెన్నుపోటు వల్లనే చేవెళ్ల, పరిగిలలో ఓడిపోయాం.

 

మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను పొట్టు పొట్టుగా తిట్టారని కేటీఆర్ గుర్తు చేశారు. కేశవరావు, కడియం శ్రీహరి వంటి వారు పార్టీ నుంచి వెళ్లిపోయినా.. మన పార్టీ నుంచి నిలబడిన వారిని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలి. రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి నమ్మించి మోసం చేశారు.  బయటి వాళ్లు మోసం చేస్తే బాధ అనిపించదు.. పార్టీ వాళ్లు మోసం చేస్తే కచ్చితంగా బాధ వేస్తుంది. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు అన్నారు. కష్టకాలంలో కాసాని పార్టీలోకి వచ్చారు. చేవెళ్లలో కాసానిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news