నేటి నుంచి 5 రోజుల పాటు పెద్దగట్టు జాతర

-

తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర అయిన శ్రీ లింగమతుల స్వామి జాతర నేడు ప్రారంభం కానుంది. సూర్యపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్ పల్లి శివారులో ఐదు రోజులపాటు యాదవుల ఆరాధ్య దైవమైన లింగమతుల స్వామిని పూజిస్తారు.

మొదటిరోజు గంపల ప్రదక్షిణ, రెండవ రోజు చౌడమ్మ తల్లికి బోనాలు, మూడో రోజు స్వామివారి కల్యాణోత్సవం, నాలుగో రోజు నెలవారం, 5వ రోజు ప్రత్యేక అలంకరణ కార్యక్రమాలు ఉంటాయి. ఈ శ్రీ లింగమతుల స్వామి జాతర కు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news