కేసీఆర్ ను ప్రజలు తరిమికొడతారు – షబ్బీర్ అలీ

-

సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. నేడు గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను ప్రజలు తరిమి కొడతారని అన్నారు. అలా జరగకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీనుండే కెసిఆర్ ప్రస్థానం మొదలైందని.. కాంగ్రెస్ పాలనలో ఓఆర్ఆర్ నిర్మిస్తే కేసీఆర్ దాని ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు.

కెసిఆర్ కుటుంబానికి ఉండడానికి కూడా ఇల్లు ఉండేది కాదని.. ఇప్పుడు కోటీశ్వరులు ఎలా అయ్యారని ప్రశ్నించారు. కెసిఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తానంటే ఆయన ఇష్టమని అన్నారు. తాను కాంగ్రెస్ తరపున కామారెడ్డి నుండే పోటీ చేస్తున్నానని తెలిపారు షబ్బీర్ అలీ. ఉద్యమం సమయంలో కేటీఆర్ అమెరికాలో ఉన్నాడని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news