కిస్ పెట్టకుంటే బిల్డింగ్​పై నుంచి తోసేస్తా.. విద్యార్థినులతో పీఈటీ అసభ్య ప్రవర్తన

-

నాకు ముద్దు పెడతావా లేదా బిల్డింగ్ పైనుంచి తోసేయాలా అంటూ ఓ పీఈటీ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్​లో చోటుచేసుకుంది. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు అతడికి దేహశుద్ధి చేశారు. ఈ నేపథ్యంలో పీఈటీతోపాటు ప్రధానోపాధ్యాయుడిని డీఈవో సస్పెండ్‌ చేశారు.

స్థానిక ఉన్నత పాఠశాల పీఈటీ సంగ్రాం.. మార్చిలో ముగ్గురు విద్యార్థినులను వేర్వేరుగా పాఠశాల భవనంపైకి తీసుకువెళ్లాడు. ముద్దు పెట్టాలని, లేకపోతే కిందకు తోసేస్తానంటూ భయపెట్టాడు. ఇటీవల పాఠశాల ప్రారంభమైనా.. ఆ బాలికలు బడికి వెళ్లడం లేదు. ఏమైందని కుటుంబ సభ్యులు అడగ్గా.. పీఈటీ ఉంటే భయంగా ఉందని ఆ బాలికలు తెలిపారు. దీంతో కోపోద్రిక్తులైన వారు గ్రామస్థులతో కలసి శుక్రవారం పాఠశాలకు వెళ్లి పీఈటీకి దేహశుద్ధి చేసి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. సంఘటన స్థలానికి డీఈఓ వెంకటేశ్వర్లు, కంగ్టి సీఐ రాజశేఖర్‌ వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడారు. పీఈటీ, హెచ్‌ఎంలను సస్పెండ్‌ చేస్తూ అక్కడికక్కడే ఉత్తర్వులు జారీచేశారు. పీఈటీపై పోక్సో కేసు నమోదు చేస్తామని, హోంగార్డుపైనా చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news