నేడు తెలంగాణకు ప్రధాని మోదీ

-

సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొనేందుకు జాతీయ నేతలు రంగంలోకి దిగారు. మరోవైపు ప్రధాని మోదీ కూడా పలుమార్లు రాష్ట్రంలో సభలు నిర్వహించారు. ఇక తాజాగా ఇవాళ మరోసారి ఎన్నికల ప్రచారం కోసం మోదీ రాష్ట్రానికి వస్తున్నారు.

ఈరోజు సాయంత్రం జహీరాబాద్‌లో నిర్వహించే బీజేపీ బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరవుతారు. ఇందుకోసం దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రానున్నారు. దిల్లీ నుంచి దుందిగల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో జహీరాబాద్‌ వెళ్తారు. తర్వాత బహిరంగసభ జరిగే వేదికకు చేరుకొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హెలిక్యాప్టర్‌లో మళ్లీ దుండిగల్‌ చేరుకొని అక్కడి నుంచి దిల్లీ బయలుదేరి వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభలో మోదీ బీఆర్ఎస్, కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టనున్నారు. మరోవైపు మోదీ రాకకోసం ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రధాని సభకు పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news