BREAKING : తన వర్గం నుంచి తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన పొంగులేటి

-

ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ కీలక నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్ర పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా టిఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నా ఆయన ఆత్మీయ సమావేశాల పేరిట ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో సభలు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ సభల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టిఆర్ఎస్ అధిష్టానం తనను నమ్మించి మోసం చేసిందని, తన అనుచరులకు కూడా సరైన గౌరవం ఇవ్వలేదని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారటం ఖాయం అనే వార్తలు ఎప్పటినుంచో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే, తన వర్గం నుంచి తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తాజాగా, పొంగులేటి వర్గం లో చేరారు విజయా భాయ్. 2018 ఎన్నికల్లో సిపిఐ నుంచి వైరా నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విజయ..ఇప్పుడు పొంగులేటి వర్గం లో చేరారు. దీంతో వైరా నుంచి తమ అభ్యర్థిగా విజయా భాయ్ వుంటుందని ప్రకటించారు పొంగులేటి.

Read more RELATED
Recommended to you

Latest news