పొంగులేటి చివరి ఆత్మీయ సభ.. రాజకీయాలపై ఇవాళ కీలక ప్రకటన..?

-

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు చివరి దశకు చేరుకున్నాయి. నేడు ఖమ్మం నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనం కొనసాగనుంది. నేటి సభ తర్వాత పాదయాత్ర చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.

అయితే ఈ సమ్మేళనంలో ఆయన రాజకీయ భవితవ్యాన్ని ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఏ పార్టీలోకి వెళతారనే ఉత్కంఠకు తెరపడనుందా లేదా… వేచి చూస్తారా అనేది తేలనుంది. అయితే.. నేడు ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి ఆత్మీయ సమావేశానికి జూపల్లి కృష్ణరావు, కోదండ రామ్ కూడా హాజరుకానున్నారు. కాగా.. మొన్నటి వరకు కేటీఆర్‌ సోషల్‌ మీడియాను ఫాలో కానీ.. మాజీ ఎంపీ పొంగులేటి.. నిన్నటి నుంచి మళ్లీ ఫాలో అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news