Ponguleti : పొంగులేటి ఆస్తులు రూ.433.93 కోట్లు..తెలంగాణలోనే టాప్‌!

-

తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజు 140 నామినేషన్లు దాఖలు అయ్యాయి. తొలి రోజుతో కలిపి మొత్తంగా 234 నామినేషన్లు నమోదయ్యాయి. నిన్న దాఖలు చేసిన వారిలో బీఆర్ఎస్ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, యాదయ్య, హర్షవర్ధన్, కాంగ్రెస్ నుంచి శ్రీధర్ బాబు, పొంగులేటి, బీజేపీ నుంచి రాజాసింగ్, రమేష్ రాథోడ్ తదితరులు ఉన్నారు.

Ponguleti’s assets are Rs.433.93 crores

ఇక నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పులు ప్రకటించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో అత్యధిక ఆస్తులున్న అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిలిచారు. ఆయన తన కుటుంబానికి రూ. 433.93 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫీడవిట్ లో ప్రకటించారు. ఆ తర్వాత స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి నిలిచారు. తన కుటుంబం పేరిట రూ. 227.51 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. తనకు రూ. 112.75 కోట్ల అప్పులు కూడా ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news