ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత

-

ప్రజాయుద్ధనౌక గద్దర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ ఇటీవల గుండెకు సంబంధించిన ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు గద్దర్. కాగా ఆదివారం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు సూర్యం వెల్లడించారు.

1949 మెదక్ జిల్లా తూప్రాన్ లో జన్మించిన గద్దర్ ప్రత్యేక ఉద్యమంలో తన పాటలతో జనాన్ని ఎంతగానో ఉత్తేజపరిచారు. పలు సినిమాలకి కూడా గద్దర్ పాటలు రచించారు. నీ పాదం మీద పుట్టుమచ్చనై పాటకి జాతీయ అవార్డు కూడా గద్దర్ ని వరించింది. కానీ ఆ అవార్డును ఆయన తిరస్కరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన హఠాన్మరణంతో పాట మూగబోయింది.

Read more RELATED
Recommended to you

Latest news