ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు వ్యతిరేకంగా పోస్టర్లు

-

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. అచ్చంపేట ఆత్మ గౌరవాన్ని 100 కోట్లకు అమ్ముకున్నారని పోస్టర్ లో ఆరోపించారు. గువ్వల దురుసు ప్రవర్తనతో పలువురి పై దాడి చేసిన అంశాలను కూడా ఫ్లెక్సీలో ప్రస్తావించారు. ” అచ్చంపేట ఆత్మగౌరవాన్ని 100 కోట్లకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అమ్ముకున్నాడు.. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలారా, యువకుల్లారా, మేధావులారా, విద్యావంతుల్లారా ఒక్కసారి ఆలోచించండి.

ఎటు పోతుంది మన అచ్చంపేట ఆత్మగౌరవం ” అంటూ వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. దీంతో టిఆర్ఎస్ కార్యకర్తలు ఆ పోస్టర్లని తొలగిస్తున్నారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. స్థానిక టిఆర్ఎస్ నేతలు ఈ పోస్టర్లపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news