కన్నీళ్లు తెప్పిస్తున్న ప్రవల్లిక సూసైడ్ లెటర్

-

హైదరాబాదులో గ్రూప్-2కు ప్రిపేర్ అవుతున్న ప్రవల్లిక రాసిన సూసైడ్ నోట్ కన్నీళ్లు తెప్పిస్తోంది. ‘నన్ను క్షమించండి అమ్మా! నేను చాలా నష్టజాతకురాలిని. నావల్ల మీరు బాధపడుతూనే ఉన్నారు. ఏడవకండి అమ్మా. జాగ్రత్తగా ఉండండి. మీకు పుట్టడం నా అదృష్టం.

నన్ను కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా. నన్ను ఎవరూ క్షమించరు. మీ కోసం నేను ఏం చేయలేకపోతున్నా’ అని లేఖ రాసి తనువు చాలించింది. ఇది ఇలా ఉండగా, ప్రవల్లిక ఆత్మ ఘోష…సీఎం కేసీఆర్ చెవికి వినబడటం లేదా అని పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి ఫైర్ అయ్యారు. అశోక్ నగర్ లో ఆత్మహత్య చేసుకున్న ఆడబిడ్డ ప్రవల్లిక సంఘటనపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. అశోక్ నగర్ లో ఆత్మహత్య చేసుకున్న ఆడబిడ్డ ప్రవల్లిక తరపున న్యాయం కావాలని వేల గొంతులు నినదిస్తున్నా, కేసీఆర్ చెవికి వినబడటం లేదని మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Latest news