ప్రధాని మోడీ ఓ శాడిస్ట్.. నియంత : ఎమ్మెల్యే కూనంనేని

-

పొత్తులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఒక ఎంపీ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని సీపీఐ డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎంపీ సీటుపై కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొత్తు ధర్మం ప్రకారం కాంగ్రెస్ సీపీఐకి ఒక పార్లమెంట్ ఇస్తుందని ఆశిస్తున్నామన్నారు. సీపీఐకి సీటు ఇవ్వాల లేదా అనేది కాంగ్రెస్ విచక్షణ అని అన్నారు. కాంగ్రెస్ తమకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే తర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తామని స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా బీజేపీని కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా ఎదుర్కొలేకపోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ అరెస్ట్పైన ఆయన స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రివాల్ అరెస్ట్ అన్యాయమని అన్నారు. కేజీవాల్ ఇండియా కూటమిని వీడనందుకే బీజేపీ అరెస్ట్ చేయించదని ఆరోపించారు. ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఓ శాడిస్ట్, నియంత అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎలక్టోరల్ బాండ రూపంలో బీజేపీ కొటు కొలగొట్టిందని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news