డ్రగ్స్ విషయంలో టీడీపీ-బీజేపీ నేతల పాత్ర ఉంది : సజ్జల

-

డ్రగ్స్ విషయంలో టీడీపీ-బీజేపీ నేతల పాత్ర ఉందని అనుమానిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇవాళ  తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు సజ్జల. తప్పించుకోవడానికే మాపై నిందలు వేస్తున్నారు. విశాఖ డ్రగ్స్ విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలున్నాయని తెలిపారు.

మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని చంద్రబాబు పగటి కలలు కంటున్నారు. లోకేష్ కూడా ప్యూచర్ లో సీఎం అవుతానని కలలు కంటున్నాడని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో మాట్లాడటానికి ఏమి లేక డ్రగ్స్ విషయంలో తప్పుడు నిందలు మాపై వేస్తున్నారని మేము భావిస్తున్నామని తెలిపారు. తప్పుడు ప్రచారం, అబద్దాలు మాట్లాడటం టీడీపీకి అలవాటు అయిందని సజ్జల పేర్కొన్నారు. తప్పు చేసి మాపై రివర్స్ ఆరోపణలు చేస్తున్నారు. మోకాలుకి, బట్టతలకు సంబంధం ఉందా..? అని ప్రశ్నించారు. కంటైనర్ లో దొరికిన డ్రగ్స్ వాళ్ల బంధువులకు సంబంధించినవే అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news