వికారాబాద్ లో ఫార్మా భూ రైతుల ఆందోళన..!

-

వికారాబాద్ జిలా.. దుద్యాల మండలంలో ఫార్మా భూ రైతుల ఆందోళన చేపట్టారు. రోటి బండ తాండలో కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడిని తాండ వాసులు నిర్భందించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే దుద్యాల మండలంలోని దుద్యాల లగచర్ల పోలేపల్లి గ్రామాలలో ఫార్మా ఏర్పాటులో భూములు కోల్పోతున్నారు. రైతుల అభిప్రాయాన్ని సేకరించేందుకు నేడు ఆయా గ్రామాల రైతులతో సమావేశయం అయ్యేందుకు జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ హాజరు కానుండటంతో రోడ్లపైకి ఆందోళన చేసేందుకు రైతులు వచ్చారు.

అలాగే దుద్యాల మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు అవిటి శేఖర్ సమావేశానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుండి లగచర్ల వెళ్తుండగా.. రోటిబండ తాండలోని గిరిజన రైతులు ఆయనకు అడ్డుపడి ప్రశ్నించగా.. ఆయన ఫార్మకు తమ భూములు ఇవ్వాలని డిమాండ్ చేయగా.. అగ్రహించిన రైతులు శేఖర్ పై దాడికి పాల్పడ్డారు. తాండలోని గ్రామ పంచాయతీ భవనంలో నిర్భందించారు. తమ భూములు తమకు కావాలని ఆందోళన చేపట్టారు. ఇక పరిస్థితి ఉదృతంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు రైతుల ఆందోళనను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. తర్వాత పోలీసులు శేఖర్ ను గ్రామం నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు

Read more RELATED
Recommended to you

Latest news