సంస్థాన్‌ నారాయణపురంలో ఎమ్మెల్యే రఘునందన్‌ రావుకు నిరసన సెగ

-

మునుగోడు ఉపఎన్నిక రాజకీయం రోజురోజుకు హీట్ రాజేసుకుంటోంది. ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్ది ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచుతున్నాయి. ఓవైపు టీఆర్ఎస్.. మరోవైపు బీజేపీ నాయకులకు అక్కడక్కడా నిరసన సెగ తగులుతూనే ఉంది. తాజాగా మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు చుక్కెదురైంది.

సంస్థాన్‌ నారాయణపురంలో ప్రచారం నిర్వహిస్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావుకు చేదు అనుభవం ఎదురైంది. మండలంలోని లింగవారిగూడెంలో రఘునందన్‌ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.  గ్రామ ప్రజల నుంచి ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. తమ ఊర్లో ప్రచారం చేయడానికి వీల్లేదని తెగేసి చెప్పారు. ఇక చేసేందేం లేక రఘునందన్‌ రావు వెనుతిరిగారు.

మరోవైపు.. ప్రచారంలో భాగంగా గ్రామాలకు వెళ్లిన ఆ పార్టీ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డిని ప్రజలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. ఏ మొహం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నావని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news