కేసీఆర్‌ ఓ బేవాకూఫ్‌ ముఖ్యమంత్రి..బుల్డోజర్లను ఎక్కిస్తాం : రాజాసింగ్‌

-

తెలంగాణలో బేవాకూఫ్ ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నాడని.. సభలో కేసీఆర్ అవినీతిని బయట పెడ్తారన్న కారణంగానే ఈటలను సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్. సీఎం కేసీఆర్ తో యుద్ధానికి బీజేపీ సైనికులు సిద్ధం కావాలని.. ఈటల రాజేందర్, బండి సంజయ్ లు వ్యక్తులు కాదు.. శక్తులు అని స్పష్టం చేశారు.

బండి సంజయ్ కి అమిత్ షా.. బుల్డోజర్ ను గిఫ్ట్ గా పంపిస్తున్నారని.. తెలంగాణలో అవినీతి దొంగలపై బుల్డోజర్లను ఎక్కిస్తామని టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలకు వార్నింగ్‌ ఇచ్చారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో ఒక బుల్డోజర్ ను తిరుగబోతోందని.. అక్రమ కేసులతో బీజేపీ నేతలను, కార్యకర్తలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని పేర్కొన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే.‌. కేసీఆర్ రెడీగా ఉండాలని.. తెలంగాణలో టీఆర్ఎస్ రాజ్యం ఉంటే.. ఢిల్లీలో బీజేపీ రాజ్యం ఉందని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. రావణ వద మాదిరి .. త్రిబుల్ ఆర్ చేతిలో వదకు కేసీఆర్ సిద్ధంగా ఉండాలన్నారు రాజాసింగ్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news