ఓం కేసీఆర్.. ఓం కేసీఆర్ అని తపస్సు చేస్తున్నా : MLA రాజయ్య

-

ఓం కేసీఆర్.. ఓం కేసీఆర్ అని తపస్సు చేస్తున్నానంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ MLA రాజయ్య ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తాను గడ్డం పెంచుకుంటున్నానని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు.

‘గతంలో మునులు, రుషులు ఓం… ఓం అంటూ తపస్సు చేసేశారు. కానీ నేను ఓం కేసిఆర్…. ఓం కేసీఆర్ అంటూ నిత్యం తపస్సు చేస్తూ గడ్డం పెంచుతున్నా. కేసీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నా. మరో వారం రోజులు ఈ తపస్సులో ఉంటాను’ అని రాజయ్య తెలిపారు. మరోసారి కేసీఆర్‌ సర్కార్‌ వస్తుందని.. మూడో సారి కూడా ఆయనే సీఎం అవుతారని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురులేదని.. తేల్చి చెప్పారు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.

Read more RELATED
Recommended to you

Latest news