రాజాసింగ్ ఆవేశంలో విచక్షణ కోల్పోయి మాట్లాడారు – మాజీ ఎంపీ రాపోలు

-

రాజా సింగ్ ఆవేశంలో విచక్షణ కోల్పోయి మాట్లాడాడని అన్నారు మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్. రాజసింగ్ కూడా తన వ్యాఖ్యల పట్ల విచారంలో ఉన్నాడని భావిస్తున్నానని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో కేసీఆర్ కుటుంబం పై వస్తున్న ఆరోపణలపై స్పదించారు రాపోలు ఆనంద భాస్కర్. అవినీతికి,అక్రమార్జనకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడివరకు వెళ్లడం లో ఆశ్చర్యం లేదన్నారు. ఆరోపణలతోనే ముందస్తుగా నిందలు వేయాల్సిన అవసరం లేదన్నారు రాపోలు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ అక్రమాలపై చట్టబద్ధంగా సీబీఐ దర్యాప్తు జరుపుతుందన్నారు. సిబిఐ దర్యాప్తులో అన్ని అంశాలు బయటపడతాయన్నారు. ఆధారాలు లేకుండా దర్యాప్తు సంస్థలు ముందుకు వెళ్లవని అన్నారు. దర్యాప్తు సంస్థలు పారదర్శకంగానే పనిచేస్తాయని.. తొందర పాటు చర్యలు ప్రజాస్వామ్యంలో నిలబడవన్నారు. కక్ష సాధింపు చర్యలు అనే ఆరోపణలు అధికార పక్షం ఎదుర్కొవడం సాధారణ అంశమని అన్నారు. అధికార పక్షం కింద అధికార యంత్రాంగం,దర్యాప్తు సంస్థలు పనిచేస్తాయి కాబట్టి ఆరోపణలు రావడం సహజం అని అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news