రంగారెడ్డి జిల్లాలో BRSకు బిగ్‌ షాక్‌..కాంగ్రెస్‌ లోకి కీలక నేత

-

 

 

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో.. కీలక నేతలు పార్టీలు మారుతున్నారు. టికెట్లు రాని వారు.. వచ్చే పార్టీకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. రంగారెడ్డి జిల్లాలో BRSకు బిగ్‌ షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ పార్టీలోకి కీలక నేత వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. రంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇవాళ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా DCCB చైర్మన్ మనోహర్ రెడ్డి BRS కి రాజీనామా చేస్తున్నారు.

Ranga Reddy District DCCB Chairman Manohar Reddy
Ranga Reddy District DCCB Chairman Manohar Reddy

పరిగి నుంచి BRS ఎమ్మేల్యే టికెట్ ఆశించి భంగపడ్డ మనోహర్ రెడ్డి…BRS కి రాజీనామా చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా DCCB చైర్మన్ మనోహర్ రెడ్డికు తాండూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కి ఒకే చెప్పింది హై కమాండ్. ఇక రేపు ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా DCCB చైర్మన్ మనోహర్ రెడ్డి. ఇవాళ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా DCCB చైర్మన్ మనోహర్ రెడ్డిని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, వికారాబాద్ DCC రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి దగ్గరకి తీసుకువెళ్లనున్నారు ప్రసాద్, రామ్మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news