చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి.. మల్కాజ్‌గిరి నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి!!

-

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు శరావేగంగా మారిపోతున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్‌ కావడంతో… అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే.. తాజాగా చేవెళ్ల, మల్కాజ్ గిరి అభ్యర్థుల ప్రకటన కాంగ్రెస్‌ పార్టీ నుంచి కాస్త క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి.. మల్కాజ్‌గిరి నుండి పట్నం సునీత మహేందర్ రెడ్డి పోటీ చేయబోతున్నారని సమాచారం అందుతోంది.

ranjith reddy contest from chevella

కాంగ్రెస్ పార్టీ తరపున చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుండి పట్నం సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తారని భావిస్తున్న తరుణంలో సర్వేలు ఆమెకు అనుకూలంగా రాలేదట. దీంతో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని ఆయనకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించగా పట్నం సునీతకు మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news