“మన ఊరు -మన బడి” కోసం రూ.7,289 కోట్లు విడుదల : హరీష్ రావు

-

“మన ఊరు -మన బడి” కార్యక్రమం కోసం రూ.7,289 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. ధళిత బంధు, మన ఊరు మన బడి సంక్షేమ పథకాల పై మంత్రి హరీష్‌రావు సమీక్ష నిరహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. దళిత బందు కింద ఈ ఏడాది ఉమ్మడి మెదక్ జిల్లాలో 1156 మంది లబ్దిదారులకు 115 కోట్ల రూపాయిలు వినియోగించ నున్నామని… దళితబంధు కార్యక్రమంలో ఎక్కవగా డెయిరీ యూనిట్లు ఏర్పాటుచేసుకునే విధంగా ప్రోత్సహించండన్నారు.

ఏ యూనిట్ ఇచ్చినా సక్రమంగా వినియోగించుకునే విధంగా ఎమ్మెల్యేలు,అధికారులు స్వయంగా లబ్దిదారుల ఇండ్లకు మంచిగా అవగాహన కల్పించాలని.. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి పర్యటనకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం 390 కోట్ల నిధులు విడుదల చేశారని గుర్తు చేశారు. ఈ నిధులను ప్రజల అత్యంత అవసరమైన పనులకు ఉపయోగించే విధంగా ప్రతిపాదనలు రూపొందించే విధంగా ఎమ్మెల్యేలు చొరవ చూపాలని కోరారు.

మన ఊరు-మన బడి ఒక అధ్బుతమైన పథకం, దీనిని వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని పాఠశాలలో ప్రారంభిస్తామని ప్రకటన చేశారు. కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని…ఈ నెల ఎనిమిదిన ముఖ్యమంత్రి కెసిఆర్ వనపర్తిలో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారని ప్రకటన చేశారు. స్కూళ్ల మరమ్మతులు, నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా ఉమ్మడి మెదక్ జిల్లాల కలెక్టర్లు చూసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news