రాష్ట్ర రైతులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

-

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక కార్యాచరణకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. రైతులకు రుణమాఫీ చేస్తామన్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. రైతులను నిలువునా మోసం చేసిందని ఆరోపించారు. రైతులతో రాజకీయం చేయడానికి బీఆర్ఎస్ నేతలు రైతు వేదికలకు బయలుదేరారని.. వారిని నిలదీసేందుకు ఈ సమావేశాలు ఎంతో దోహదపడతాయని లేఖలో పేర్కొన్నారు.

రుణమాఫీ చెయ్యకుండా ప్రభుత్వం రైతులను మోసం చేసిందని.. ధాన్యం సేకరించిన 48 గంటలలో డబ్బులు జమ చేస్తామని చెప్పిన ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయని లేఖలో పేర్కొన్నారు. కేసీఆర్ మాటలకు మోసపోయి అప్పుల ఊబిలో చిక్కిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారని అన్నారు. రైతులను మోసం చేసిన విషయంలో కేసీఆర్ ది ఆల్ టైం రికార్డ్ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news