సాయిచంద్ మృతి… తెలంగాణ సమాజానికి తీరనిలోటు – రేవంత్ రెడ్డి

-

సాయిచంద్ మృతి… తెలంగాణ సమాజానికి తీరనిలోటు అని ఎమోషనల్‌ అయ్యారు కాంగ్రెస్‌ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. సాయిచంద్ మృతి పట్ల సంతాపం తెలిపారు కాంగ్రెస్‌ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. ప్రముఖ గాయకులు, తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ అకాల మరణం నన్ను తీవ్రంగా కలచివేసిందని వివరించారు.

చిన్న వయసులోనే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తన ఆట, పాట తో తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసిన సాయిచంద్ గుండెపోటు తో మృతి చెందడం అత్యంత బాధాకరం అన్నారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా.. సాయిచంద్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news