HYD: ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం..5 పల్టీలు కొట్టిన కారు !

-

హైదరాబాద్‌ లోని రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హిమాయత్ సాగర్ వద్ద డివైడర్ ను ఢీ కొట్టింది ఓ కారు. అయితే.. ఈ తరుణంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.‌ మితిమీరిన వేగంతో దూసుకొని వచ్చి ఔటర్ పై డివైడర్ ను ఢీ కొట్టింది కారు.

Road accident on outer ring road 5 cars overturned

అయితే.. 5 పల్టీలు కొట్టిన కారులో నుంచి ఇద్దరు యువకులు కింద పడిపోయారు. ఈ ప్రమాద సమయంలో కారు 180 స్పీడ్ లో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను శంషాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కారులో అందరూ యువకులే……ఇద్దరు యువకులు స్పాట్ లో మృతి చెందారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news