నిజామాబాద్‌లో రౌడీ షీట‌ర్ వీరంగం

-

నిజామాబాద్‌లో అనుచ‌రుల‌తో క‌లిసి ఓ రౌడీషీట‌ర్ వీరంగం సృష్టించారు. ఇర్ఫాన్ ఖాన్ ఇలియ‌స్ అనే ఇద్ద‌రు వ్య‌క్తుల‌పై క‌ర్ర‌లు, రాళ్ల‌తో దాడి చేశాడు. నిజామామాద్ ప‌ట్ట‌ణ ప‌రిధిలోని ఆటోన‌గ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.దాడికి పాల్ప‌డిన వారిని ఇబ్బు చావుస్‌, అత‌ని అనుచ‌రులుగా గుర్తించారు పోలీసులు. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఓ హోట‌ల్‌లో ఇర్ఫాన్ ఖాన్‌, ఇలియ‌స్ ఉండ‌గా అదే స‌మ‌యంలో ఇబ్బు అక్క‌డికి వ‌చ్చాడు. ఇర్పాన్, ఇలియ‌స్‌ల‌ను ప‌క్క‌కు జ‌ర‌గాల‌ని ఇబ్బు చెప్ప‌గా వారు ప‌ట్టించుకోలేదు. దీంతో వారి మ‌ధ్య గొడ‌వ త‌లెత్తింది.

వెంట‌నే ఇబ్బు త‌న అనుచ‌రుల‌ను పిలిపించి ఇర్ఫాన్, ఇలియాస్‌ల‌పై దాడికి దిగారు. ఈ ఘ‌ర్ష‌ణ‌లో ఇరు వ‌ర్గాల వారికి తీవ్రంగా గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన బాధితుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఆరుగురు నిందితుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. న‌లుగురిని ఇప్ప‌టికే అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఇబ్బుపై గ‌తంలో ప‌లు పోలీస్ స్టేష‌న్ లో రౌడీ షీట్ న‌మోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news