BREAKING : వరంగల్ లో అదుపు తప్పి పొలాల్లోకి వెళ్ళిన ఆర్టీసీ బస్సు

-

హనుమకొండ జిల్లాలో ఘోర రోడు ప్రమాదం చోటు చేసుకుంది. హనుమకొండ జిల్లా ఓగులపూర్ వద్ద అదుపు తప్పి.. పొలాల్లోకి వెళ్ళింది తెలంగాణ ఆర్టీసీ బస్సు. వరంగల్ 2 డిపో బస్సు ఈ ప్రమాదానికి గురైంది. హనుమకొండ నుంచి ఏటూరు నాగారం వెళ్తున్న సమయంలో అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది ఆర్టీసీ బస్సు.

RTC bus went out of control in Warangal and went into fields

అయితే.. ఈ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయినట్లు అధికారులు గుర్తించారు. స్వల్పంగా గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు స్థానికులు. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు, అధికారులు. ఇక బస్సు ప్రమాదం పైన స్పందించారు వరంగల్ 2 డిపో మేనేజర్ సురేష్. డ్రైవర్ కు తల తిప్పడంతో సడన్ బ్రేక్ వేయడం జరిగిందని..అందుకే పొలాల్లోకి బస్సు వెళ్లిందన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు వరంగల్ 2 డిపో మేనేజర్ సురేష్.

Read more RELATED
Recommended to you

Latest news