తెలంగాణ రైతులకు రైతుబంధు నిధులు… సజ్జల సీరియస్ !

-

తెలంగాణ రైతులకు రైతుబంధు నిధులు విడుదల కావడంపై..వైసీపీ నేత సజ్జల రామకృష్టారెడ్డి సీరియస్ అయ్యారు. రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్‌కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను షురూ చేసింది. ఈ నిధులు ఆర్థికశాఖ ద్వారా బ్యాంకులకు చేరగా సోమవారం నుంచి నేరుగా ఎకరాకు రూ.5 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పంట నష్టపరిహారం ఇచ్చేందుకు ఈసీ అంగీకారం తెలిపింది. అయితే దీనిపై సజ్జల స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పథకాల నిలుపుదల సరి కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దీని వెనుక ఎవరున్నారో తెలుసు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పంట నష్టపరిహారం ఇచ్చేందుకు ఈసీ అంగీకారం తెలిపిన దుయ్యబట్టారు. రైతుబంధు నిధులకు కూడా ఇచ్చేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మండిపడ్డారు. నిధుల విడుదలలో తెలంగాణకు ఒక న్యాయమా ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక న్యాయమా ? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news