తండ్రి చొక్కాను పట్టుకుని పడుకుంటున్న సాయిచంద్‌ కొడుకు..ఫోటో వైరల్‌ !

-

తెలంగాణ ఉద్యమ కళాకారుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. గుండె పోటు కారణంగా గత వారం రోజుల కిందట తెలంగాణ ఉద్యమ కళాకారుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ మరణించారు. అయితే.. సాయిచంద్‌ మరణంతో.. ఆయన పిల్లలు, భార్య బిక్కు బిక్కుమని ఏడుస్తున్నారు.

ఇక సాయిచంద్‌ కొడుకు అయితే.. దిండుకు తన తండ్రి చొక్కా తొడిగి.. మరి పడుకుంటున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్‌ గా మారింది. కాగా, గాయకుడు సాయి చందు భార్యకు కూడా గుండె నొప్పి వచ్చింది. గాయకుడు సాయి చందు మరణాన్ని తట్టుకోలేక ఆయన భార్య రజిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న సాయంత్రం ఆమెకు గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు సాయిచంద్ భార్యను ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news