మల్లారెడ్డి ఐటీ కేసులో రెండవ రోజు ముగిసిన విచారణ

-

మల్లారెడ్డి ఐటీ కేసులో రెండవ రోజు విచారణ ముగిసింది. రేపు విచారణకు హాజరుకానున్నారు మంత్రి మల్లారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి. ఈరోజు మల్లారెడ్డి ఆడిటర్ ను నాలుగు గంటల పాటు విచారించారు ఐటీ అధికారులు. మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్, డైరెక్టర్లను విచారించారు ఐటీ అధికారులు. సీట్ల కేటాయింపుల నుండి పేమెంట్ డీటెయిల్స్ వరకు వివరాలను సేకరించారు.

సీటు పేమెంట్లు ఎన్ని బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయని ఆరా తీశారు ఐటీ అధికారులు. సీట్ పేమెంట్ ను ఎన్ని విధాలుగా చెల్లిస్తారు.? చెల్లింపులు అన్నింటికీ రిసిప్ట్లు ఆన్లైన్, మాన్యువల్ రూపంలో ఉంటాయని ప్రశ్నించారు ఐటీ అధికారులు. ఈరోజు సేకరించిన వివరాలతో రేపు కాలేజీ చైర్మన్, డైరెక్టర్లుగా వ్యవరిస్తున్న మర్రి రాజశేఖర్ రెడ్డి, చామాకుర భద్రారెడ్డి లను విచారించనున్నారు ఐటీ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news