కాంగ్రెస్ సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి కన్నుమూత

-

కాంగ్రెస్ పార్టీ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత ఇంద్ర సేనా రెడ్డి కన్ను మూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యం గా బాధ పడుతున్నారు. ఆయన పరిస్థితి విషమించి ఆదివారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు.

గతంలో ఎమ్మెల్సీ గా పని చేసిన ఇంద్రా సేనా రెడ్డికీ ఇందిరా గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఇంద్ర సేనా రెడ్డి మరణ వార్త తెలిసిన కాంగ్రెస్ శ్రేణులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news