నాపై ఆరోపణలు నిరూపిస్తే…ఉరి వేసుకుంటా – ఎమ్మెల్యే షకీల్

-

నాపై ఆరోపణలు నిరూపిస్తే…ఉరి వేసుకుంటానంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజమాబాద్ జిల్లా బోధన్ లో ఎమ్మెల్యే షకీల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ బోధన్ ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ….బోధన్ లో నేను అవినీతికి పాల్పడ్డట్లు నిరూపిస్తే ఉరి వేసుకుంటానని వెల్లడించారు.

తెలంగాణ లో కాంగ్రెస్- బీజేపీ మధ్య మాచ్ ఫిక్సింగ్ నడుస్తుందని ఫైర్‌ అయ్యారు. ఎంపీ అర్వింద్ తో అభివృద్ధి పై చర్చకు సిద్ధమని.. ఎంపీ గా గెలిచి జిల్లాకు ఎన్ని నిధులు తెచ్చారో ప్రజలకు చెప్పాలని ఛాలెంజ్‌ విసిరారు. అభివృద్ధి పై మాట్లాడమంటే అంటే బీజేపీ నేతలు స్కాం ల గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. బీజేపీ నీ సొంత పార్టీ వాళ్ళే వ్యతిరేకిస్తున్నారని చురకలు అంటించారు బీఆర్‌ఎస్‌ పార్టీ బోధన్ ఎమ్మెల్యే షకీల్.

Read more RELATED
Recommended to you

Latest news