తెలంగాణ అనే పదం ఉన్న ఏకైక పార్టీ YSRTP – వైఎస్‌ షర్మిల

-

తెలంగాణ అనే పదం ఉన్న ఏకైక పార్టీ YSRTP అని వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ లో ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ YSRTP అని.. ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్న ఏకైక పార్టీ YSRTP అని పేర్కొన్నారు. జై తెలంగాణ అనే దమ్ము ఉన్నది వైఎస్ షర్మిలకు మాత్రమేనని… జై తెలంగాణ అనే పదం రేవంత్ రెడ్డికి,కేసీఅర్ కి,మోడీకి ,సోనియా కు అనే హక్కు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి అల్లుడు కూడా ఆంధ్రా అట అంటూ చురకలు అంటించారు. నాది ఆంధ్ర అయితే..మరి సోనియా గాంధీ ఎక్కడ..? అంటూ రేవంత్‌ పై షర్మిల సీరియస్‌ అయ్యారు. సోనియా గాంధీది ఇటలీ కదా… ఒక ప్రాంతాన్ని వదిలేసి.. సొంత వాళ్ళను కాదు అనుకొని… ఒక మహిళ పెళ్లి చేసుకున్నందుకు ..బిడ్డలను కానీ తనని తానే అంకితం చేస్తుంది మహిళ అంటూ పేర్కొన్నారు. ఇది మన దేశ సంస్కృతి, గొప్పదనం అని షర్మిల పేర్కొన్నారు. ఇంత గొప్ప సంస్కృతిని అర్థం చేసుకోవాలి అనుకుంటే సంస్కారం ఉండాలని ఫైర్‌ అయ్యారు. ఇంతటి సంస్కారం రేవంత్ రెడ్డికి లేదు… నాకు చీర, సారే పెడతాడట.కానీ ఇక్కడ రాజకీయాలు చేయొద్ధట అంటూ చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news