కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై విచారణ చేపట్టాలి.. షర్మిల ఫైర్..!

-

కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోవడం గురించి ఇవాళ షర్మిల్ ఫైర్ అయ్యారు. తాను సంచలన ట్వీట్ చేశారు. పేరు గొప్ప ఊరు దిబ్బ లెక్కుంది దొరగారి కమీషన్ల కాళేశ్వరం దుస్థితి.. నా రక్తం, నా చెమట అని కల్లబొల్లి మాటలు చెప్పి..కట్టింది ప్రాజెక్ట్ కాదు పేక మేడ అని బయట పడ్డది.తెలంగాణ ప్రజల సంపద 1.27 లక్షల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టినట్లు? ఏం ఉద్ధరించినట్లు? మేడిగడ్డ బ్యారేజ్ పై డ్యామ్​ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు మీ మెగా అవినీతికి,మెగా పనితనానికి నిదర్శనం.వందల ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండాల్సిన బ్యారేజ్ లు.. కట్టిన నాలుగేళ్లకే ముక్కలైన ఘనత ప్రపంచలోనే మన మెగా కేసీఆర్ కే దక్కింది.

దాదాపు 80 వేల పుస్తకాలు చదివిన దొర మెగా ఇంజినీరింగ్ పనితనం ప్రపంచానికి తెలిసింది. లోపాలు కళ్లముందు కొట్టొచ్చినట్లు కనపడుతుంటే..దొర లక్ష కోట్ల దోపిడీ జనాలకు అర్థమైతుంటే.. బీటలు బారడం కామనట. నెర్రెలు రావడం సహజమట… ఇంతకాలం జనాలను మభ్యపెట్టింది చాలు కేసీఆర్ గారు. మీ దోపిడీ పాపం పండింది. మీ అవినీతికి కాలం చెల్లింది.తిన్నదంతా కక్కించే దాకా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు.కాళేశ్వరం ప్రాజెక్ట్ పై వెంటనే ఒక దర్యాప్తు కమీషన్ ను వేయాలని..జరిగిన అవినీతిపై విచారణ తక్షణం చేపట్టాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news