సీఎం రేవంత్ కు షాక్.. కాంగ్రెస్ NRIలు హై కమాండ్ కి ఫిర్యాదు

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాను పీసీసీ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పార్టీలో దూసుకెళ్తూ.. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. తన సొంత నియోజకవర్గంలో ఓ వైపు ప్రచారం చేసుకుంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తూ.. షెడ్యూల్ నిర్వహించుకొని పార్టీ విజయానికి చాలా  కృషి చేశారు. ఆయన చేసిన  కృషికి అధిష్టానం సీఎం పదవీ బాధ్యతలను అప్పగించింది. 

తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో కొనసాగుతున్నారు. ఈ తరుణంలో ఆయనకు షాక్ తగిలిందనే చెప్పాలి. అమెరికా పర్యటనలో పెట్టుబడుల ప్రకటనలపై వస్తున్న ఆరోపణలను లేఖ ద్వారా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు ఎన్నారైలు. రేవంత్ రెడ్డి తన తమ్ముడి కంపెనీతో ఎంఓయూ అంశాన్ని కూడా లేవనెత్తిన ‘ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఏ’ బృందం. ఈ పెట్టుబడుల ప్రకటనలపై ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.  రేవంత్ రెడ్డి చుట్టూ టీడీపీ, బీజేపీకి చెందిన ఎన్నారైలు చేరారని కాంగ్రెస్ ఎన్నారైల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news