వరంగల్ లో దారుణం…ఫోన్ ద్వారా నార్మల్ డెలివరీ చేసిన నర్సులు…చివరికీ ఠాగూర్ సినిమా!

-

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి చెందింది. అందుబాటులో డాక్టర్ లేకపోవడంతో ఫోన్ ద్వారా నార్మల్ డెలివరీ చేశారు సిస్టర్లు. ఈ తరుణంలోనే… శిశువుకు శ్వాశ అడటం లేదంటూ 108లో ఏం జి యం కి తరలించింది వైద్య సిబ్బంది. మృతి చెందిన శిశువును ఠాగూర్ సినిమా తరాహలో సిబ్బంది వరంగల్ ఎంజీఎం కి ఆస్పత్రికి తరలించన్నట్లు బంధువులు ఆరోపణలు చేస్తున్నారు.

Pregnancy-Normal-Delivery

ఎంజీంఎంలో శిశువు చికిత్స పొందు నిన్న ఉదయం మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ నెల 16న వర్ధన్నపేట ఆసుపత్రి చేరింది గర్భిణీ శ్రీజ. మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలం గుండేపూడి గ్రామానికి చెందిన శ్రీజకు…ఈ నెల 17న నొప్పులు తీవ్రంగా కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఇక అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఆపరేషన్ థియేటర్లోకి ఆమెను తరలించారు నర్సులు. ఇక బంధువుల ఫిర్యాదు మేరకు వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ లో నమోదు అయింది. వైద్యులపై సెక్షన్ 304 కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు పోలీసులు. నిర్లక్ష్యం వహించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news