గురుకులంలో పాముకాటు.. ఇద్దరూ పరిస్థితి విషమం.. అనుమానస్పదంగా మరో విద్యార్థి మృతి..!

-

జగిత్యాల జిల్లా పెద్దపూర్ గురుకుల స్కూల్ హాస్టల్లో పడుకున్న ఇద్దరు విద్యార్థులను పాము కాటు వేయగా పరిస్థితి విషమంగా ఉంది. అదే రూములో పడుకున్న మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెట్ పల్లికి చెందిన హర్షవర్ధన్ (14), ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్ కొండాపూర్ గ్రామానికి చెందిన ఆడేపు గణేశ్ (14) పెద్దాపూర్ గురుకుల స్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. గురువారం రాత్రి హాస్టల్ రూంలో పడుకోగా అర్ధరాత్రి 3. గంటల టైంలో హర్షవర్ధన్, గణేశ్ చేతులపై ఏదో కాటేసినట్టు గుర్తించారు. ఏదో పురుగు కావచ్చని అనుకుని అలాగే పడుకున్నారు.

ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురవడంతో తోటి విద్యార్థులు కేర్ టేకర్ కు సమాచారమిచ్చారు. వారు వచ్చిచూసి నీళ్లు తాగిపించినా, ఏదైనా తినిపించినా తినలేదు. దీంతో వారిని ఉదయం ఆరు గంటలకు మెట్పల్లి సివిల్ హాస్పిటల్ తీసుకువెళ్లారు. విద్యార్థుల చేతులపై ఉన్న గాట్లు చూసి పాము కాటు వేసిందని డాక్టర్లు నిర్ధారించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గుర్తింపు హాస్పటల్ కు తరలించారు. కాగా, ఈ విషయంలో ప్రిన్సిపాల్, కేర్ టేకర్.. విద్యార్థులకు కనీస ట్రీట్మెంట్ ఇప్పించకుండా.. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఇదే గురుకులంలో ఎనిమిదో తరగతి చదువుతూ పాము కాటు వేసిన రూములోనే పడుకున్న మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.

Read more RELATED
Recommended to you

Latest news