తెలంగాణలో సోనూ సూద్ కు గుడి.. ఎక్కడంటే ?

-

ప్రభుత్వం విధించిన కరోనా లాక్డౌన్ సమయంలో ఎంతో మందికి సహాయ సహకారాలు అందించి రియల్ హీరో గా నిలిచిన అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దూలిమిట్ట మండలం దుబ్బ తండా గ్రామంలో ఆయన ఏకంగా గుడి కట్టేశారు అక్కడి గ్రామస్తులు. రాజేష్, రామ్ అనే ఇద్దరు ఆయనకు ఈ గుడి కట్టించి నట్లు గా సమాచారం మధుసూదన్ అనే ఆయన చేత సోనూసూద్ విగ్రహం తయారు చేయించి ఈ గుడి నెలకొల్పినట్లు సమాచారం.

త్వరలోనే సోనూసూద్ ని కలిసి గుడిని సందర్శించాలని కోరతామని నిర్వాహకులు చెబుతున్నారు. సోనూసూద్ ప్రస్తుతం ఆచార్య అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు ఈ సినిమాలో ఆయనను కొట్టే సీన్ ఉండడంతో తాను చేయలేనని చిరంజీవి చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇక సోనూ సూద్ తాను విలన్  పాత్రలు చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news