ప్రజలతో మర్యాదగా మాట్లాడండి: కేసీఆర్

-

రెవిన్యూ శాఖ విషయంలో గత కొంతకాలంగా సీఎం కేసీఆర్ ఆగ్రహం గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తో రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కేసీఆర్ వారికి సూచించారు.

ప్రజల్లో చైతన్యం పెరిగిందని పోలీస్ శాఖ రెవెన్యూ శాఖలో కూడా మార్పు రావాలని ఆయన స్పష్టం చేశారు. రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలి అని  వారికి కేసీఆర్ సూచనలు చేశారు. రెవిన్యూ శాఖలో అన్ని స్థాయిల్లో ప్రమోషనల్ ప్రక్రియ పూర్తి చేయాలని తహశీల్దార్లకు కారు అలవెన్సులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వీఆర్వోలు ఇతర శాఖల్లో చేరేందుకు ఆప్షన్లు ఇస్తామని అన్నారు. వయోభారం ఉన్న వీఆర్వోల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news