Dk శివకుమార్ కు స్పెషల్ థాంక్స్ : మంత్రి హరీష్ రావు

-

తెలంగాణ వస్తేనే మన గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. సునీతా లక్ష్మారెడ్డి ని గెలిపించే బాధ్యత ఎమ్మెల్యే మదన్ రెడ్డిదే అని.. మదన్ రెడ్డిని ఎంపీ చేసే బాధ్యత నాది అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. కర్ణాటకలో మూడు గంటల కరెంట్ ఇస్తున్నామని మేము చెప్పాం.. కర్ణాటక లో 5 గంటలే కరెంట్ ఇస్తున్నామని నిన్న డీకే శివకుమార్ నిజాలు చెప్పారు. కానీ 5 గంటలు ఇవ్వట్లేదు 3 గంటలే ఇస్తుంది. డీకే శివకుమార్ మాటలతో కాంగ్రెస్ పార్టీ సమాధి కట్టింది. డీకే శివకుమార్ కి థాంక్స్ చెబుతున్నానని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

5 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్పావ్.. ఇంకా బస్సెదుకు మాకు కర్ణాటక రావడానికి డీకేనే నిజాలు చెప్పారు కదా.. కర్ణాటక మోడల్ ఫెయిల్యూర్ మోడల్ అన్నారు హరీశ్ రావు. రైతు బంధు డబ్బులు ఇవ్వొద్దని ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గు లేదు. రేవంత్ మూడు గంటల కరెంట్ చాలు అంటాడు. డీకే శివకుమార్ ఐదు గంటల కరెంట్ ఇస్తున్నామని అంటాడు. రైతులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి. తస్మాత్ జాగ్రత్త…మోసపోతే గోస పడుతాం. మెడమీద తలకాయ ఉన్నోడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన కళ్ళల్లో మనం పొడుచుకున్నట్టేనని.. కాంగ్రెస్ అన్ని అబద్ధాలు చెబుతుంది

Read more RELATED
Recommended to you

Latest news