అక్కడి ప్రజలకు శుభవార్త.. గాదరి కిషోర్ ని గెలిపిస్తే అన్ని మండలాల్లో దళిత బంధు : కేసీఆర్

-

తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ని గెలిపిస్తే తుంగతుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో దళితబంధు తీసుకొస్తానని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఇవాళ తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. తుంగతుర్తిలో ఏ ఊరి చెరువులో చూసినా నీళ్లు ఉండేవి కావు.. గోదావరి నీళ్లు కావాలి అని గోడలపై రాతలు ఉండేవి.. ఇప్పుడు అన్ని చెరువులు నిండుగా ఉన్నాయి.. తుంగతుర్తిని చూస్తే తృప్తిగా ఉంది.. దేవాదుల నీళ్లు రావాల్సి ఉంది, ఆ పనులు జరుగుతున్నయ్.. బస్వాపూర్‌ ప్రాజెక్టు నుంచి నీళ్లు రాబోతున్నాయి.. సుమారు రెండు లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. తెలంగాణ రాక ముందు ఏదైనా మాట్లాడితే నక్సలైట్‌ ముద్రేసి జైల్లో వేసేవారు.. ఆనాడు చెంచాగిరి చేసినోళ్లు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు.

రైతుబంధును వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ప్రశంసించారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉందని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. మనతో పొత్తు పెట్టుకొని ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి మన దగ్గర సుద్దులు చెబుతున్నారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే దళితులకు దళిత బంధు వంటి పథకం పెడితే దళితుల బతుకులు ఎప్పుడో మారేవని పేర్కొన్నారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news