గురుకుల పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులకు అస్వస్థత.. ఫినాయిల్ తాగడంతో..

-

హన్మకొండ జిల్లా ఆరేపల్లిలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఫినాయిల్‌ తాగడం వల్లే అస్వస్థతకు గురైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

ములుగు జిల్లాకు చెందిన మహాత్మా జ్యోతిరావుపూలే  బీసీ గురుకుల పాఠశాలలో ఆదివారం ఉదయం అల్పాహారం చేస్తున్న సమయంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినుల మధ్య ఘర్షణ జరిగింది. మాటల దూషణల కారణంగా ఐదుగురు విద్యార్థులు తీవ్ర మనస్తాపం చెందారు. దీంతో బాతురూంలో వాడే ఫినాయిల్‌ను ఒకరి తర్వాత ఒకరు ఐదుగురు తాగారు. ఈ విషయాన్ని వారితో గొడవపడిన విద్యార్థినులు ప్రిన్సిపల్‌కు తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news