తెలంగాణలో త్వరలో టీడీపీ బస్సు యాత్ర

-

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించిన చంద్రబాబు నాయుడు… ఇప్పుడు బస్సు యాత్ర చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బస్సు యాత్రపై కీలక ప్రకటన చేశారు.

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వచ్చే నెల నుంచి టిడిపి బస్సు యాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. ఇందుకోసం రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని, వీలైనన్ని ఎక్కువ అసెంబ్లీ స్థానాల్లో ఈ బస్సు యాత్ర చేపట్టేలా ప్లాన్ చేస్తున్నట్లు వివరించారు. బస్సుయాత్ర జరుగుతున్న సమయంలోనే పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news