తెలంగాణ కౌంటింగ్ అప్డేట్స్.. ఇప్పటివరకు ముందంజలో ఉన్నది వీళ్లే

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల కౌంటింగ్‌ పూర్తి చేశారు. ఇప్పుడు ఈవీఎం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన లెక్కింపు ప్రకారం.. గజ్వేల్‌లో కేసీఆర్‌ (బీఆర్ఎస్), ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు (కాంగ్రెస్‌), అశ్వారావుపేటలో ఆదినారాయణ (కాంగ్రెస్‌), గోషామహల్‌లో రాజాసింగ్‌ (బీజేపీ), హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌), ముషీరాబాద్‌లో ముఠా గోపాల్‌ (బీఆర్ఎస్), సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య (బీఆర్ఎస్), కామారెడ్డి, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్‌) ముందంజలో ఉన్నారు.

తుంగతుర్తిలో శామ్యూల్‌ (కాంగ్రెస్‌), మధిరలో మల్లు భట్టి విక్రమార్క (కాంగ్రెస్‌), ఆదిలాబాద్‌లో పాయల్‌ శంకర్‌ (బీజేపీ), భువనగిరిలో కుంభం అనిల్‌ కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌), కొత్తగూడెంలో కూనంనేని సాంబశివరావు (సీపీఐ) కోరుట్లలో సంజయ్‌ (బీఆర్ఎస్), సిద్దిపేటలో హరీశ్‌రావు (బీఆర్ఎస్), హుస్నాబాద్‌లో పొన్నం ప్రభాకర్‌ (కాంగ్రెస్‌), సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (కాంగ్రెస్‌), నర్సాపూర్‌లో సునీతా లక్ష్మారెడ్డి (బీఆర్ఎస్)ముందంజలో కొనసాగుతున్నారు.

తొలిరౌండ్‌లో గజ్వేల్‌లో కేసీఆర్‌ 8,827 ఓట్లతో ఆధిక్యంలో ఉండగా .. భువనగిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి అనిల్‌కుమార్‌రెడ్డికి 944 ఓట్ల ఆధిక్యం లభించింది. మధిరలో కాంగ్రెస్‌ అభ్యర్థి భట్టి విక్రమార్క తొలిరౌండ్‌లో 2,098 ఓట్ల ఆధిక్యం కనబరిచారు. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌) 2,380 ఓట్లతో లీడ్‌లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news