తుది దశకు కేబినెట్ విస్తరణ.. రేపు దిల్లీకి సీఎం రేవంత్

-

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు పీసీసీ నూతన అధ్యక్షుని నియామకంపై కూడా త్వరలోనే స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాలపై తుది నిర్ణయం కోసం కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు మరోసారి దిల్లీకి వెళ్లనున్నారు.

ఇప్పటికే కొంత కసరత్తు జరిగినా, ఈ వారంలో తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉండటంతో మరోసారి పార్టీ అధిష్ఠానంతో చర్చించనున్నట్లు తెలిసింది. అయితే మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు ఇవ్వాలనే దానిపై హైకమాండ్తో రాష్ట్ర నాయకత్వం సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఎక్కువసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు, ఎన్నికల ముందు చేరికల సమయంలో ఇచ్చిన హామీలు, సామాజిక న్యాయం తదితర అంశాల ప్రాతిపదికన విస్తరణ జరుగుతుందని తెలిసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఈ నెల 3వ తేదీన దిల్లీకి వెళ్లే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version