వర్షాలు, విద్యుత్ సమస్యల వల్ల కొన్నిచోట్ల పోలింగ్ ఆలస్యం: వికాస్‌రాజ్‌

-

రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తన కుటుంబ సభ్యులతో వచ్చి హైదరాబాద్‌లోని ఎస్్ఆర్ నగర్‌ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడక్కడ వర్షాలు పడడంతో పోలింగ్ సామాగ్రిని తరలించేందుకు కాస్త ఇబ్బందులు తలెత్తినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతుందని అన్నారు. వేసవి నేపథ్యంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా షామియానాలు, మంచినీటి సదుపాయాన్ని కల్పించామన్నారు. రాష్ట్ర ప్రజలందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటున్న ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ కోరారు.

‘వర్షాలు, విద్యుత్ సమస్యల వల్ల కొన్నిచోట్ల పోలింగ్ ఆలస్యమైంది. వర్షాల వల్ల కొన్నిచోట్ల ఈవీఎంల తరలింపులో ఇబ్బందులు తలెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఎద్దుల బండ్లపై ఈవీఎంలు తీసుకెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ చురుగ్గా, ప్రశాంతంగా జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు వస్తే సరిచేశాం. ప్రజలంతా ఓటుహక్కు వినియోగించుకోవాలి.’ అని సీఈవో వికాస్‌రాజ్‌ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news