ఈరోజు బీజేపీపై కాంగ్రెస్ ఛార్జ్ షీట్ విడుదల

-

తెలంగాణలో 15 ఎంపీ స్థానాల్లో గెలుపై లక్ష్యంగా అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. మిషన్‌-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తూ.. అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలు వివరిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఛార్జ్షీట్ విడుదల చేయనుంది. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రానికి చేసేంది ఏంటని శూన్యమని చెప్పేందుకే ఈ ఛార్జ్షీట్ విడుదల చేస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో బీజేపీపై కాంగ్రెస్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్డ్ దీపాదాస్ మున్షీ పాల్గొననున్నారు. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news