తెలంగాణలో కరోనా జోరు.. భారీగా పెరిగిన కేసులు..!

-

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 2,058 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,180 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,60,571 కి చేరింది. వీరిలో ఇప్పటివరకు మొత్తం 1,29,187 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 984 కు చేరింది.

ప్రస్తుతం ఆసుపత్రుల్లో 30,400 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన మరో 23,534 మంది హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యశాఖ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. అయితే కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీలో అధికంగా 277 కేసులు నమోదు అయ్యాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల్లో 51,247 టెస్టులు జరగగా.. ఇప్పటి వరకు 22,20,586 టెస్టులు జరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news