రేపే తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఫలితాలు !

-

తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఫలితాలు రేపు విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంసెట్ కమిటీ రేపు ఫలితాలను విశ్లేషించి ఆమోదించనుంది. గత నెల 18వ తారీకు నుంచి 21వ తారీకు వరకు ఇంజనీరింగ్ అలాగే 30 31 వ తేదీన అగ్రికల్చర్ ఫార్మా ఎంసెట్ పరీక్షలను నిర్వహించారు అధికారులు.

ఇంజనీరింగ్ కు లక్ష యాభై ఆరువేల మంది హాజరు కాగా… అగ్రికల్చర్ మరియు ఫార్మా కోర్సుల కొరకు 80 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ప్రాథమిక సమాధానాలు విడుదల చేసి విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. తుది సమాధానాలతో పాటు ఫలితాలను ఎంసెట్ కమిటీ విశ్లేషించి నిర్ణయం తీసుకోనుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమయాన్నిబట్టి రేపు లేదా ఎల్లుండి ఫలితాలను విడుదల చేసే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news